తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:18

AP News: అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ

విజయవాడ (గాంధీనగర్‌), ముమ్మిడివరం: వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు..

సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 09 2024, 15:22

ఎండిన పంటలను అంచనా వేసి ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి

ఎండిన పంటలు అంచనా వేసి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జునప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజీపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జి చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాలలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని  అవేదన వ్యక్తం చేశారు. నివారించడం కొరకు ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించిపంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ రైతులు పోషబోయిన యాదయ్య, దేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతిపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 09 2024, 15:15

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక సురక్షా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్గొండ మాజీ MPP దైద రజిత గారి భర్త వెంకట్ రెడ్డి గారిని పరామర్శించిన కంచర్ల భూపాల్ రెడ్డి గారు

ఇదే అంశంపై సురక్షా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా.రాకేశ్ రెడ్డి గారిని కలుసుకొని మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 06 2024, 12:51

టీజేఎస్ లో చేరిన బిఎస్పి నాయకులు


 

 తెలంగాణ జన సమితి పార్టీ విధానాలు నచ్చి పనిచేయుటకు ముందుకు వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు జి నాగేశ్వరరావు, మునుగోడు నియోజకవర్గ నాయకులు మల్గా యాదయ్య, నారీ బలరాజు కు నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రొఫెసర్ కోదండరాం సార్ కండువలు కప్పి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్గొండ జిల్లా పార్టీ బలోపేతం చేయుటకు కృషి చేయాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్  నల్గొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, కార్యదర్శి పులి పాపయ్య, సర్దార్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జన సమితి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుటకు అవినీతి లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పనిచేస్తున్న తెలంగాణ జన సమితిలో ఉద్యమకారులు మేధావులు నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ జన సమితిని మరింత బలోపేతం చేయుటకు పార్టీలో చేరాలని కోరినారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 19:21

ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతి

విద్యార్థులు తన ఉపాధ్యాయులతో నిర్వహించుకునే ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతిని మిగుల్చుతుందని గీతాంంజలి పాఠశాల కరస్పాండెంట్ మారోజు భారతి విజయ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

2008-09 సంవత్సరపు విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

బాల్యంలో తల్లిదండ్రులు గురువులైతే విద్యాబోదనతో పాటు సమాజంలో మెలకువలను నేర్పేది ఉపాధ్యాయులని అన్నారు.

పట్టుదలతో చదివిన ప్రతి ఒక్కరు నేడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. మున్ముందు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇస్మాయిల్,ఊటుకూరి రవీందర్, దామళ్ళ యల్లయ్య,గంట యల్లయ్య,విజయ,నిర్మల,పూర్వక విద్యార్థులు వినయ్,అశోక్,ఖాలేద్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 18:22

కమలం గూటికి బిఆర్ఎస్ కీలక నేత

వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే రమేష్ పార్టీ మారుతుం డటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టే అవుతుం దని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోం ది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతు న్నారు.

అయితే ఆరూరి రమేష్‌తో బీఆర్ఎస్ అగ్ర నేతలు బుజ్జగించేందుకు ప్రయ త్నిస్తున్నారు. మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రమేష్‌ను బుజ్జగించే బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది.

కానీ ఆయనని బుజ్జగిం చేందుకు కడియం అంగీ కరించలేదు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను బీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వ రాజు బుజ్జగిస్తున్నారు.

అయితే రమేష్ పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు 15మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే.

అయితే రమేష్ కూడా పార్టీ మారుతుండటంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కకావికలం అవుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 18:20

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. కానిస్టేబుల్‌ సహా మహిళా మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయి స్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిసింది.. 

కాంకేర్‌ జిల్లాలోని హిదూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచా రంతో పోలీసులు, బీఎస్ ఎఫ్ దళాలు, ఆపరేషన్ చేపట్టాయి.

ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయి స్టులు కాల్పులు ప్రారం భించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో కాని స్టేబుల్ రమేశ్‌, ఓ మహిళా మావోయిస్టు చనిపోయారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 16:27

పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

గత నెలలో జరిగిన వివాదాస్పద ఎన్నికల తర్వాత పాకిస్తాన్ శాసనసభ్యులు షెహబాజ్ షరీఫ్‌ను దేశ ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు.

పాక్ ప్రధానిగా షెహబాబ్ వరుసగా రెండో సారి పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ పార్లమెంట్ లో షెహబాబ్ కు 201 మంది మద్దతు పలికారు. పిఎంఎల్-ఎన్, పిపిఏ కూటమికి చెందిన చెందిన షెహబాబ్ పాక్ ప్రధానిగా ఎన్నికైయ్యారు.

పిటిఐ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు 92 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఫిబ్రవరి 8న ఓటింగ్‌లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, ఆలస్యమైన ఫలితాల ఆరోపణలతో ఓటింగ్ జరిగింది. ఆదివారం, జాతీయ అసెంబ్లీ, పార్లమెంటు దిగువ సభగా పిలువబడే విధంగా, ప్రధానమంత్రిని ఎన్నుకో వడానికి సమావేశ మైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 16:25

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: భోగ శ్రావణి

రాయికల్ మండలం అల్లీపూర్ లో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి ఆదివారం టాస్ వేసి ప్రారంభించారు.

అనంతరం సరదాగా బ్యాటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ యూత్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 16:24

తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు.

కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలం గాణలో రాజకీయ పరిణా మాలు మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు...